Sankranthi Kodi Pandalu: ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై ఆంక్షలు ఉన్నా.. గ్రామ శివారుల్లో, ఫామ్ హౌజల్లో రూ.కోట్లలో పందేలు సాగుతున్నాయి. కాకినాడ జిల్లాలోని పెనుగుదురు కోడి పందేల్లో నిర్వాహకులు ఏకంగా ‘మహేంద్ర థార్’ ను బహుమతిగా పెట్టారు. దీంతో ఎలాగైనా పోటీలో గెలిచి థార్ జీపును చేజిక్కించుకునేందుకు పందేం రాయుళ్లు తమ పుంజులతో రంగంలోకి దిగారు. కొన్ని చోట్ల బంగారు నాణేలతో టాస్ వేయగా, మరికొన్ని చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
ALSO READ : Sankranti Kodi Pandalu: కోళ్ల పందేలు ఎన్ని రకాలుంటాయో మీకు తెలుసా..?