Homeఫ్లాష్ ఫ్లాష్Security: ఈటల ,అరవింద్ కు వై కేటగిరి భద్రత

Security: ఈటల ,అరవింద్ కు వై కేటగిరి భద్రత

Security: తెలంగాణ బీజేపీలోని ఇద్దరు నాయకులకు వై ప్లస్ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై ప్లెస్, వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈటల రాజేందర్‌కు “వై ప్లస్ కేటగిరి” కల్పించగా.. ధర్మపురి అర్వింద్‌కు “వై కేటగిరి”ని కేటాయించింది. భద్రతతోపాటు ఈ ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాల కేటాయించారు. ఇదిలావుంటే, తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో ఈటల రాజేందర్ భార్య ఈటల జమున మీడియాతో చెప్పడం.. అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల రాజేందర్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాసేపట్లో ఇద్దరి నాయకుల ఇళ్లకు సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు చేరుకుని భద్రత ఏర్పాట్లను పరిశీలించనున్నారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి ఒక కమాండోతో సహా 8 నుంచి 11మందితో సెక్యూరిటీ కల్పించనున్నారు . ఈటల రాజేందర్‌కు ఇద్దరు కమాండోలతో సహా 11మందికి పైగా భద్రతాసిబ్బంది అందించనున్నారు.

Recent

- Advertisment -spot_img