హైదరాబాద్–ఇదేనిజం : అక్రమంగా గంజాయి తరలించిన కేసులో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కేసు వివరాలను నగర టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావు, వేస్ట్జోన్ టాస్క్ఫోర్స ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతో కలిసి వివరాలను వెల్లడలించారు. 5గురు యువకులు కలిసి ఒక మూఠాగా ఏర్పడి ఏజేన్సీ ప్రాంతం నుంచి గంజాయిని నగరానికి ఆక్రమంగా తరలించి వాటిని నగరంలో అవసరమైన వారికి అందిస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘా వేసి టప్పాచబుత్ర బస్స్టేషన్ సమీపంలో మాటు వేసి నిఘాఉంచారు. ఆయితే ఆదారిలో ఒక స్వీఫ్ట్ వాహానం వేగంగా రావడంతో వేంటనే ఆపి సోదా చేయగా అందులో 5గురు యువకులు ఆషీష్సింగ్(42), సుమీత్ముకాడీయా(35),రమావత్మోతిలాల్(30),రమావత్విజవయ్(29), రాజ్కుమార్(35) తదితరులుపట్టుబడ్డారు. వారి వద్దనుంచి 100 కేజీల భారీ గంజాయి, 7 సెల్ఫోన్, ఒక స్వీఫ్ట్ వాహానం స్వాధీనంచేసుకుని రిమాండ్కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో ఆశిష్సింగ్ పాతనేరస్థుడని గతంలో గుడుంబ రవాణ చేసే వాడని దర్యాప్తులో తెలింది.