పోలీసులకు అందిన నిర్థిష్టమైన సమాచారం మేరకు సరిహద్దు భధ్రతా బలగాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బలగాలు నేతృత్వంలో ఏవోబీలోని కలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని సూధికొండ సమీపంలో కురూబ్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహించగా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్లో ఆయుధాలు తయారీకు ఉపయోగించే లేత్మిషన్, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిషన్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్లవసాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా మల్కన్గిరి జిల్లా కార్యాలయంలో విలేకర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్రదర్శించారు.