ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్కి భారీ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడిని మొత్తంగా తమ ఫ్రాంచైజీ నుంచి వదులుకోవడానికి సిద్ధమైంది. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుందని సమాచారం. రూ.18 కోట్లకు పూరన్ను రిటైన్ చేసుకోనుందని తెలుస్తుంది. ఐపీఎల్ 2024లో రాహుల్ పేలవ కెప్టెన్సీ చేయడమే అతడి వేటుకు కారణమని తెలుస్తోంది.