Homeహైదరాబాద్latest NewsSHOCKING: భార్యను కాపురానికి పంపట్లేదని అత్తను అల్లుడు ఏం చేశాడో తెలుసా..?

SHOCKING: భార్యను కాపురానికి పంపట్లేదని అత్తను అల్లుడు ఏం చేశాడో తెలుసా..?

అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. నారమాకుల పల్లికి చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ కర్రతో కొట్టి చంపాడు. నీలావతి పెద్ద కూతురు సుధాతో విజయ్ కుమార్‌కు పెళ్లి జరిగింది. ఇద్దరూ గొడవలు పడటంతో సుధాను పుట్టింటికి తీసుకొచ్చింది నీలావతి. అయితే భార్యను తనతో పంపాలని విజయ్ కుమార్ కోరాడు. దానికి అత్త నీలావతి నిరాకరించింది. శనివారం ఉదయం గొడవ అవ్వడంతో కర్ర తీసుకొని అత్త తలపై బలంగా కొట్టాడు. దాంతో ఆమె మృతి చెందింది.

Recent

- Advertisment -spot_img