ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా సీబీఎస్ఈ తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దాంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని భావిస్తోంది. ఫస్టియర్లో అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని భావిస్తోందని సమాచారం. దీనిపై ప్రజాభిప్రాయాల సేకరణ తర్వాతే ముందుకు వెళ్లనుంది.