సౌత్ హీరోయిన్లలో కీర్తి సురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మహానటి’ సినిమాతో అందరి మనసులను తన నటనతో దోచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. కృతి శెట్టి కూడా తెలుగు సినిమాలతో పాటు తమిళం, మలయాళం సినిమాలపై దృష్టి సారించింది. తాజాగా వీరిద్దరూ చీరకట్టు కటి.. తమ సొగసు చూడు తరమా అంటూ… తమ అందాలతో ఆకర్షిస్తున్నారు.