Homeహైదరాబాద్latest NewsSourav Ganguly: పాక్ కు అంత సీను లేదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sourav Ganguly: పాక్ కు అంత సీను లేదు.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sourav Ganguly: దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వారం పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
గంగూలీ మాట్లాడుతూ, “త్వరలోనే మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తాము. పాకిస్తాన్‌కు ఎక్కువ రోజులు ఒత్తిడిని తట్టుకునే అంత సీన్ పాకిస్తాన్‌కు లేదని తెలిపారు.. ఐపీఎల్‌లో మన దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది” అని పేర్కొన్నారు.
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐపీఎల్ అభిమానులు మరోసారి తమ అభిమాన ఆటగాళ్లను మైదానంలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img