– విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
– యూనివర్సిటీ పేరు చెప్పి లక్షల ఫీజులు తీసుకున్నారని ఆరోపణ
– ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇదేనిజం, హైదరాబాద్: ఘట్కేసర్ లోని శ్రీనిధి కళాశాల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. కళాశాల యాజమాన్యం తమ వద్ద యూనివర్సిటీ అంటూ రూ. లక్షల ఫీజు వసూలు చేసిందని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బుధవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా యూనివర్సిటీ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్సిటీ నుంచి శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలోకి విద్యార్థులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వర్సిటీ లోపలికి మీడియాను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను అరెస్టు చేసి ఘట్ కేసర్ పీఎస్ కు తరలించారు.