విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీర్లోయిన్లుగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025లో జనవరి 14న విడుదల కానుంది. గతంలో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్’2, ‘ఎఫ్3’ సినిమాలు హిట్ కొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెంకటేశ్ ఒకసారి 3వేలమంది అభిమానులతో ఫొటోలు దిగారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించారు.