దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు తరువాత పుంజుకొని లాభాల్లోకి జారుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 1126 పాయింట్ల లాభంతో 75,347 వద్ద ముగియగా.. నిఫ్టీ 356 పాయింట్లు లాభపడి 22,952 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్, మారుతీసుజుకీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.