స్టాక్ మార్కెట్(Stock markets) సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 23,500 మార్క్ దిగువకు కుంగింది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 371 పాయింట్ల నష్టంతో 77,488.95 వద్ద, నిఫ్టీ 116.1 పాయింట్ల నష్టంతో 23,443.85 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ మరింత పతనమైంది.