దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 22,215 వద్దకు చేరింది. సెన్సెక్స్ 330 పాయింట్లు పుంజుకుని 72,112 వద్ద ముగిసింది. ఎం అండ్ ఎం, JSW స్టీల్, ఎల్ అండ్ టీ, NTPC, SBI, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. TCS, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలు చవిచూశాయి.