దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 22 వేల పాయింట్లకు దిగువన ముగిసింది. సెన్సెక్స్ 1,062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమై 21,957.50 వద్ద స్థిరపడింది. హీరో మోటాకార్ప్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ లాభాల్లో ముగిశాయి.