సాధారణంగా శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ, ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను బీఎస్ఈ , ఎన్ఎస్ఈ నిర్వహిస్తున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 143.8 పాయింట్ల లాభంతో 74,060 వద్ద, నిఫ్టీ 50.95 పాయింట్లు ఎగబాకి 22,517 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.