ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 992 పాయింట్లు లాభపడి 80,109 పాయింట్ల మార్కును చేరింది. BSE సెన్సెక్స్ లో L&T (4.13%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.52%), అదానీ పోర్ట్స్ (2.55%), HDFC బ్యాంక్ (2.21%), ICICI బ్యాంక్ (1.82%) టాప్ గెయినర్లుగా నిలిచారు. టాప్ లూజర్స్ గా JSW స్టీల్ (-2.40%), టెక్ మహీంద్రా (-0.79%), ఏషియన్ పెయింట్స్ (-0.74%), ఇన్ఫోసిస్ (-0.73%), మారుతీ (-0.49%) నిలిచారు.