Homeహైదరాబాద్latest NewsStudents శ్రద్ధగా చదవాలి

Students శ్రద్ధగా చదవాలి

– DEO రాధా కృష్ణ

ఇదే నిజం, వెల్దుర్తి: ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదివి మంచి ఫలితాలను సాధించాలని డీఈవో రాధాకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున ప్రతి విద్యార్థి ప్రణాళికలు రూపొందించుకొని చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరుకావాలని, విద్యార్థులకు ఏ సబ్జెక్టులోనైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పదో తరగతిలో విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, పాఠశాల హెచ్ఎం సాంబయ్య, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img