Sunrisers Hyderabad : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్రైజర్స్ ఉప్పల్లో విధ్వంసం సృష్టించింది. సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ సెంచరీ చేసి ఉప్పల్లో ఊచకోత బ్యాటింగ్ ఏంటో చూపించాడు. ఇషాన్ కిషన్ కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసాడు. అభిషేక్ శర్మ 24 పరుగులు, ట్రావిస్ హెడ్ 67 పరుగులు, నితీష్ కుమార్ 30 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 34 పరుగులు చేసారు.