ఇదే నిజం డిసెంబర్ 30 బెల్లంపల్లి : మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపల్ 33వ వార్డులో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేశారు. సర్వేకు వచ్చే వార్డు ఆఫీసర్, కమిటీ సభ్యులకు ప్రజలు సహకరించాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు కౌన్సిలర్ పోలు ఉమాదేవి, పోలు శ్రీనివాస్ కోరారు.