Homeక్రైంఒంగోలులో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌

ఒంగోలులో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లు సస్పెన్షన్‌

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లపై వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్లు రమణకుమార్‌, రామకృష్ణ, ఎర్రగొండపాలెం సబ్‌రిజిస్ట్రార్‌ జ్ఞానసుందర్‌ను సస్పెండ్‌ చేశారు. ఎనీవేర్‌ కింద మార్కాపురంలో భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img