విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్ను తగ్గించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. NCERT సిలబస్ను దృష్టిలో ఉంచుకుని సైన్స్తో పాటు ఇతర సబ్జెక్టుల్లో పాఠాలను కుదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్లో, 2026-27 నుంచి సెకండియర్లో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్ లో 15%, జువాలజీలో 5-10% వరకు సిలబస్ను తగ్గించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.