Talliki Vandanam Scheme: సీఎం చంద్రబాబు బుధవారం సంచలన ప్రకటన చేశారు. తల్లికి పిల్లలు ఎందరున్నా సరే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. రూ.15వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘మే నెలలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తాం. ఒకరు, ఇద్దరూ లేదా ఐదుగురు.. ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ పథకాన్ని వర్తింపజేస్తాం’ అని అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టం చేశారు.