Homeహైదరాబాద్latest Newsటీడీపీ మరో 24 అభ్యర్థుల జాబితా విడుదల

టీడీపీ మరో 24 అభ్యర్థుల జాబితా విడుదల

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో 24 మంది అభ్యర్థులను ప్రకటించారు. 13 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్​ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది.

అసెంబ్లీ స్థానాల్లో..

పలాస – గౌతు శిరీష, పాతపట్నం – మామిడి గోవిందరావు, శ్రీకాకుళం – గొండు శంకర్, శృంగవరపుకోట – కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం (ఎస్సీ) – అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు – బోడె ప్రసాద్, మైలవరం – వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసారావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చీరాల – మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .

పార్లమెంట్ స్థానాల్లో..

శ్రీకాకుళం – కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్, అమలాపురం – గంటి హరీష్ మాధుర్, ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని), గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్, నరసారావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల – టి. కృష్ణప్రసాద్, నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు – దుగ్గమళ్ల ప్రసాదరావు, కర్నూలు – బస్తిపాటి నాగరాజు ( పంచలింగాల నాగరాజు ), నంద్యాల – బైరెడ్డి శబరి, హిందూపూర్ -బీకే. పార్థసారథి.

Recent

- Advertisment -spot_img