Homeహైదరాబాద్latest News'ఎలాగైనా గెలవాలి' : తీన్మార్ మల్లన్న

‘ఎలాగైనా గెలవాలి’ : తీన్మార్ మల్లన్న

ఇదే నిజం, జగదేవపూర్ : జగదేవ్‌పూర్ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి, బహుజన బిడ్డ నీలం మధు గెలుపునకు సైనికుల్లా పనిచేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్న కోరారు. గురువారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు ఉప్పల ప్రవీణ్ గుప్త, నితీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రవీణ్, కరుణకర్ రెడ్డి లు హైదరాబాదులో తీన్మార్ మల్లన్నను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. యూత్ నాయకులంతా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img