Homeజిల్లా వార్తలుఅక్రమ మొరం తరలింపును అడ్డుకున్న తహశీల్దార్

అక్రమ మొరం తరలింపును అడ్డుకున్న తహశీల్దార్

ఇదే నిజం : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మల్లూరులో తహశీల్దార్ భిక్షపతి గురువారం మొరం అక్రమ తవ్వకాలను నిలిపివేశారు. మల్లూరులోని సొసైటీ వెనుక భాగంలో ఓ రైతు జేసీబీ పలు టిప్పర్ల సహాయంతో గుట్టను తవ్వుతూ మొరాన్ని అక్రమంగా రవాణా చేయిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్లిన తహశీల్దార్ దృష్టికి మొరం తవ్వకాల విషయం వచ్చింది. దీంతో మొరం అక్రమ తవ్వకాల స్థలానికి వెళ్లి నిలిపివేయాలని ఆదేశించారు. పట్టా భూమి ఉన్నప్పటికీ మైనింగ్ అనుమతులు లేనిది తవ్వకాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img