తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. 2 వేలు ఉన్న పెన్షన్ను రూ.4 వేలకు, రూ.4 వేలుగా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. డిసెంబర్ 09 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల్లో ఆసరా పెన్షన్ పథకం అమలుపై ప్రకటన చేయనున్నట్టు సమాచారం. దీంతో.. అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త ఏడాది నుంచి పెంచిన డబ్బులతో పెన్షన్ లబ్దిదారుల అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.