Homeతెలంగాణతెలంగాణ రైతే దేశానికి దిక్సూచి

తెలంగాణ రైతే దేశానికి దిక్సూచి

అచ్చంపేట : మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రైతే దేశానికి దిక్సూచి అన్నారు.

మంత్రి ప్రసంగంలోని పలు అంశాలు

  • కేసీఆర్ రైతుల భవిష్యత్ కు భరోసా
  • పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు చేస్తున్నాం
  • దేశంలో ఈ పద్దతి అనుసరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • రాష్ట్రంలో సాగు ద్వారా వచ్చే పంటల దిగుబడి అంచనా వేసేందుకే ఈ నమోదు
  • సాగు వివరాలు తెలిస్తే కొనుగోళ్లు, ఇతర చర్యలకు అవకాశం ఉంటుంది
  • వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో రైతాంగానికి చేయూతనందిస్తాం
  • నాగర్ కర్నూలు జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు
  • రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు
  • రాష్ట్రంలోని ప్రాంతాల అవసరాలు, సాగును బట్టి పరిశ్రమల ఏర్పాటుకు కార్యచరణ ఖరారు చేస్తున్నాం
  • పత్తి సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి .. వాటికి ప్రభుత్వ ప్రోత్సహిస్తాం
  • రాష్ట్రంలో గోదాములన్నీ పంటలతో నిండిపోయాయి .. అవి ఖాళీ కాకముందే కొత్తపంటలు మార్కెట్లోకి రాబోతున్నాయి
  • రాష్ట్రంలో , దేశంలో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయి
  • రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం గత యాసంగిలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టింది
  • మొక్క కొనుగోళ్లతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతాంగానికి అండగా నిలిచామన్న తృప్తి కేసీఆర్​కు ఉంది
  • దేశంలో వేల కోట్లు అప్పులు తీసుకున్న వారితో వసూలు చేయలేక కేంద్రం వారి అప్పులను మాఫీ చేస్తుంది
  • గంజికి లేక వలసపోయిన తెలంగాణ రైతాంగాన్ని చూశాం
  • ఆరేళ్లలో రైతులు పండించిన పంటలు దాచుకునే జాగ గోదాంలలో లేదు
  • గత ఏడాది కోటీ 22 లక్షలు, ఈ ఏడాది ఈ వానాకాలంలో కోటీ 35 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి
  • ప్రకృతి కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందిస్తూ దీవిస్తుంది
  • 60 రోజులలో 45 రోజులు వానలు పడ్డాయి
  • కేసీఆర్ పాలనకు దేవుడు అందిస్తున్న దీవెనగా భావిస్తున్నాం
  • కరోనా విపత్తులోనూ రూ.1173 కోట్లు రైతుభీమా కోసం చెల్లించాం
  • రైతుబంధు పథకం కింద 57 లక్షల పై చిలుకు రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించాం
  • పాలకమండల రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి
  • అచ్చంపేటకు సాగునీళ్లు అందిస్తాం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో ఈ విషయం ఉంది
  • ఖచ్చితంగా పుల్జాల – చంద్రసాగర్ కాలువ పనులు పూర్తి చేస్తాం
  • అమ్రాబాద్ మండలానికి నీళ్లిచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img