కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయానికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే నూతన విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాటు విపక్ష నేతలు పాల్గొననున్నట్లు సమాచారం.

