Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ సర్కార్ జీవో జారీ

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ సర్కార్ జీవో జారీ

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. పంచాయతీ, మున్సిపల్‌, వార్డు స్థాయిలో కమిటీలు వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ మున్సిపాలిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి కమిటీకి పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది.ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు వేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కమిటీల పేర్లను పంపాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img