వాహనం కాల పరిమితి 15 ఏళ్ల తర్వాత వాలంటీర్గా స్క్రాపింగ్కు రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇస్తే, వచ్చే రెండేళ్లలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే జీవిత పన్నులో రుసుము తగ్గుతుందని వారు తెలిపారు. పాత బకాయిలు ఉంటే వాహనం రద్దు చేస్తే వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వాహనాల ప్రకారం సెక్షన్ 52A ప్రకారం రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయాలని లేదు అని తెలిపారు.15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను స్క్రాప్కి యాక్షన్ ద్వారా పంపించాలి. వాహనాలను ఆటోమేటిక్ మిషన్ల ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ద్వారా పంపిస్తారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది జరుగుతుంది. 37 పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జిల్లాలో 33, హైదరాబాద్లో మరో నాలుగు చొప్పున పెట్టనున్నాయి.. దీనికి మొత్తం 296 కోట్లు కేటాయించారు. 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీలో కచ్చితంగా చేసుకోవాలిన అవసరం లేదు అని తెలిపారు. అయితే ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 8 సంవత్సరాలలోపు దాటితే ప్రతి సంవత్సరం/త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఉంటుంది అని పేర్కొన్నారు.ప్రభుత్వం 37 టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవటానికి అనుమతి ఇచ్చింది. జిల్లాలో 33, హైదారాబాద్ నాలుగు అదనంగా పెట్టనున్నాయి. ఒక్కో దానికి 8 కోట్లు అవసరం అవుతాయి..మొత్తం 296 కోట్లు కేటాయించారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు.