తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆ పదవిలో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ చీఫ్గా పనిచేసిన ఏఆర్ శ్రీనివాస్, ఆ కేసులో దాదాపు 100 మందినిపైగా అరెస్ట్ చేశారు.