సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, తిరుమలగిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. రూ.2 లక్షల రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని బీఆర్ఎస్ చేపట్టిన రైతుల ధర్నాను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.