తెలంగాణ EAPCET ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఉదయం 10.30 గంటల తర్వాత అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్ ప్రొ.విజయకుమార్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు రూ.250 ఆలస్య రుసుము.. ఏప్రిల్ 14 వరకు రూ.500 ఆలస్య రుసుము నిర్ణయించారు. ఏప్రిల్ 18 వరకు రూ.2500 ఆలస్య రుసుము, ఏప్రిల్ 24 వరకు రూ.5000 ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.