TGPSC : ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 3 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 ఉద్యోగ ఖాళీల కోసం నిర్వహించిన గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని TGPSC విడుదల చేసింది. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 3 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారని, అభ్యంతరాలు ఆంగ్లంలో మాత్రమే తెలియజేయాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్లైన్లో సమర్పించాలన్నారు.