తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించారు. దీనివల్ల ఆర్టీసీపై ప్రతి నెలా రూ. 3.6 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. అయితే, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది మహిళలు ప్రయాణించారని వెల్లడైంది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం నుంచి మహిళా శక్తి పథకం కింద బస్సులను ప్రారంభించనున్నారు.