Homeహైదరాబాద్latest Newsలోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

తమిళనాడులో బస్సు ప్రమాదం జరిగింది. సేలంలోని ఎయిర్‌క్యాడ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు 56 మంది ప్రయాణికులతో ఏర్కాడ్ నుంచి సేలం వెళ్తోంది. ఈ క్రమంలో 13వ హెయిర్‌పిన్‌ వంక వద్దకు బస్సు రాగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img