– రేవంత్తో డీజీపీ భేటీ మర్యాదపూర్వకమే..
– గెలుపు కోసం పీసీసీ చీఫ్ ఎంతో కృషి చేశారు
– కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. కాగా ఈ స సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థిత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్ఠానమేనన్నారు. రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి ఉంటారని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.