– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బట్ట మురళీకృష్ణ
ఇదేనిజం, ములుగు ప్రతినిధి : డాక్టర్ శివారపు జనార్దన్ మృతి ఏటూరునాగారం మండల ప్రజలకు తీరని లోటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బట్ట మురళీకృష్ణ అన్నారు. డాక్టర్ శివారపు జనార్దన్ ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. డాక్టర్ జనార్ధన్ కుటుంబాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా క్వింటా బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బట్టగోపి, ప్రధాన కార్యదర్శి ఇర్సవడ్ల కిరణ్, బీసీ నాయకులు బండారి రాము, ఎర్రల నాగరాజు, బట్ట కొమరయ్య, కోసంగి రాంబాబు, పెద్ద బోయిన సమ్మయ్య, మాటూరి పాపయ్య,ఎర్రల నారాయణ, మంచెర్ల గౌరయ్య, కొంకతి కృష్ణ, కొడెం సాయి, తాండ్ర బక్కయ్య, కొంకతి వెంకట్, నర్సయ్య, పాల్గొన్నారు.