Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కరికే నాంపల్లి ప్రమాదవశాత్తు బైక్ ఢీ కొట్టి మృతిచెందగా ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో చేసిన విజ్ఞప్తికి స్పందించి పార్టీ నాయకులు కార్యకర్తల వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి 50 వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు. వారితో పాటు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 30, వేల రూపాయల ఆర్థిక సాయం క్వింటం బియ్యాన్ని అందజేశారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాల్ రెడ్డి, ఆగుళ్ల రాజేశం, యూత్ నాయకులు రంజాన్ నరేష్,తాళ్ల విజయ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎదునూరి భానుచందర్, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మిడిదొడ్డి భాను, పట్టణ ఉపాధ్యక్షులు ఎద్దండి మహేందర్ రెడ్డి, దుబ్బాక రాజు, తలారి నర్సయ్య, నల్ల బుచ్చయ్య, వెంకటి, వడ్లకొండ భరత్, ముచ్చర్ల శ్రీనివాస్, కొండయ్య, సారుగు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img