తెలంగాణ హైకోర్టు కేటీఆర్కు షాక్ ఇచ్చింది. లాయర్తో ఏసీబీ విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న కేటీఆర్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని చెప్పింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామంది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.