ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఫోన్ టాపింగ్ చేయడానికి తమ అనుమతి అవసరం లేదని కౌంటర్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫోన్ టాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫొన్ ట్యాపింగ్పై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది.