Homeహైదరాబాద్latest Newsచెరువుకు గండి కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

చెరువుకు గండి కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో గల వెల్కం చెరువుకు గురువారం మధ్యాహ్నం ఎవరు లేని సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు జెసిబి సహాయంతో చెరువుకు గండి పెట్టినట్టు తెలిసింది. ఇదే విషయమై చెరువుకు సంబంధించిన గంగపుత్రలను సంప్రదించగా కాంగ్రెస్ పార్టీ అనుచరులు వారి పొలాల కొరకు అక్రమంగా చెరువుకు గండి పెట్టినట్టు వారు ఆరోపిస్తూ శుక్రవారం కూడా ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఎమ్మార్వో కార్యాలయంలో ఎస్ ఆర్ ఎస్ పి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు గంగపుత్రలు తెలిపారు. 107 కుటుంబాలు, 500 జనాభా గల మా కుటుంబాలను రోడ్డుపాలు చేసేందుకు ఇలా గండిపెట్టి మా జీవన్ ఉపాధి మీద దెబ్బతీసే విధంగా గండి పెట్టినటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అనుచరుల పని అని వారు ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img