జవహర్ నగర్, ఇదే నిజం: రాచకొండ కమీషనరేట్ జవహర్ నగర్ పోలిస్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో తాళం వేసి ఉన్న ఇంటిని గుల్ల చేశారు దుండగులు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దమ్మాయిగూలోని వికాస్ నగర్, రోడ్ నెంబర్ 5లో నివసించే ఫనిశ్రీ నాయుడు అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మమ్మవారి ఇంటికి శనివారం పూజకి వెళ్లింది. తిరిగి సోమవారం ఉదయం వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు దుండగులు. బెడ్ రూమ్ లోని అల్మారిలో ఉన్న 15 తులాల బంగారు నగలు, 4 పట్టు చీరలు, 1 లక్షరూపాయల నగదు ఎత్తుకుపోయిన దుండగులు. విషయం తెలుసుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు..