శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఆదివారం రాత్రి ఇద్దరు మహిళాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు ఆ బాగ్ లో విషపూరితమైన పాములు చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మహిళలను అదుపులోకి తీసుకున్నారు.ఆ రెండు పాములను అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. ఆ మహిళలు పథకం ప్రకారం పాములను తీసుకొచ్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా ప్రయాణికులకు సమీపంలో పాములు కనిపించడంతో విమానాశ్రయంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
.