డస్ట్ అలర్జీ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాళ్ల ఉప్పును గోరువెచ్చని నీటిలో కరిగించి ముక్కుతో పీల్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లం రసంలో ఒక చెంచా తేనెను కలిపి తీసుకుంటే దీని నుంచి ఉపశమనం కలుగుతుంది. సోపు, జీలకర్రను మరిగిం,ిన నీటిలో వేసుకొని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.