ఇతర భాషల హీరోయిన్లు టాలీవుడ్లోకి రావడం సర్వసాధారణం. అయితే ఈ 2024 సంవత్సరంలో బాలీవుడ్తో పాటు, తమిళ, మలయాళ భాషల నుండి చాలా మంది హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమలోకి పరిచయమ్యారు. వారిలో కొంతమంది భారీ విజయాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం మొదటి సినిమాతోనే డిజాస్టర్లు అందుకున్నారు.
- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై ఏకంగా 1,200 కోట్ల వసూళ్లు రాబట్టింది.
- స్టార్ హెరో ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఈ సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జాన్వీ నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
- మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాతో భాగ్య శ్రీ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. విడుదలకు ముందే ఈ భామ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.
4.యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో టాలీవుడ్లోకి కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆడుగుపెట్టింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. - నయన్ సారిక ఈ సంవత్సరం రెండు విజయాలు అందుకుంది. ‘ఆయ్’, ‘కా’ సినిమాలతో ఆమెకు హిట్లు వచ్చాయి. అంతకు ముందు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గమ్ గమ్ గణేశ’ సినిమాలో నటించింది.
- వరుణ్ తేజ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు తెరకు మానుషి చిల్లర్ పరిచయమైంది. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. దాంతో ఈ భామకి అవకాశాలు లేవు.