తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దని బీఆర్ఎస్ కావాలనే లా ఆండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తుంది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలో భోజనంలో పురుగులు వచ్చాయన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు లేవని బిఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు బాధ్యులైన అధికారులను కూడా తమ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటలన్నింటి వెనక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది..హాస్టల్స్ లో ఆయన మనుషులు ఉన్నారు.ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రణాళికలను ఆర్ ప్రవీణ్ కుమార్ ద్వారా నడిపిస్తున్నారు అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.