ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఫార్ములా-ఈ రేస్ లో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదు అని కేటీఆర్ అన్నారు. ఈ కేసు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని తెలిపారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని రేపు హైకోర్టుకు వెళ్తాను అని కేటీఆర్ వెల్లడించారు.
క్వాష్ పిటిషన్ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్లుగా కాంగ్రెస్ వాళ్లు ఫీలవుతున్నారు అని కేటీఆర్ తెలిపారు. అవినీతిలో పట్టుబడ్డవారికి ప్రతి విషయం అవినీతిగానే కనబడుతుంది. నా మీద పెట్టిన కేసులో ఏమీ లేదు అది ఒక లొట్టపీసు కేసు అని పేర్కొన్నారు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారు వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా అని కేటీఆర్ తెలిపారు.