తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. మా సీనియర్ నాయకులను అక్రమ నిర్బంధం నుండి తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మరియు తెలంగాణ డిజిపి గారిని కోరుతున్నాను అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.